ఎవరు ఎవర్ని లేపుకుపోతున్నారా.. ?

హీరో కృష్ణుడు నిర్మాతగా మారి చేస్తున్న చిత్రం ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్’. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు జయరామ్ దర్శకత్వం వహించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని దర్శకుడు పూరి జగన్నాథ్ రిలీజ్ చేశారు.

ఇక ట్రైలర్ రొమాంటిక్ గా సాగింది. ఎవరు ఎవరిని లేపుకుపోతున్నారా ? అనే డైలాగ్ బాగా పేలింది. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందేననే సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. రొమాంటిక్, కామెడీ ఎంటర్ టైనర్ గా ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్’ ఉండనుందని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది.