పూజా హెగ్డే.. డబుల్ యాక్షన్ ?

సినిమాల్లో ఎక్కువగా హీరోలు మాత్రమే డబుల్ యాక్షన్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. హీరోయిన్స్  ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తాజాగా పూజా హెగ్డే డబుల్ యాక్షన్ చేస్తున్నట్టు సమాచారమ్. ప్రభాస్-పూజా హెగ్డే జంటగా రాధేశ్యామ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక పూజ హెగ్డే ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. పునర్జన్మల కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు చెబుతున్నారు.

ఈ చిత్రం ఇప్పటికే  70 శాతం టాకీపార్ట్ పూర్తి చేసుకుంది.  ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీదలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.