ధోని కోసం ఫేర్ వెల్ మ్యాచ్

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సడెన్ షాక్ ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు శనివారం సాయంత్రం ప్రకటించారు. ధోని రిటైర్మెంట్ ప్రకటనతో క్రికెట్ అభిమానులు షాక్ కి గురవుతున్నారు. ధోని సాధించిన గొప్ప విజయాలని, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

ధోని లేని లోటు తీరనిది. ఊడ్చలేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ధోని కోసం ఫేర్ వెల్ మ్యాచ్ ఒకటి నిర్వహించాలని బీసీసీఐని కోరారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. భారత క్రికెట్‌కు ఎన్నో విజయాలను అందించిన ధోని కోసం, మరియు అతని ఫ్యాన్స్ కోసం ఒక్క ఫేర్ వెల్ మ్యాచ్‌ని నిర్వహించాలని ఆయన బీసీసీఐని కోరారు. ఈ మ్యాచ్ కి రాంచీ స్టేడియం ఆతిధ్యం ఇస్తుందని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని అభిమానలందరి కోసం ఈ మ్యాచ్ ని పెట్టాలని కోరారు. మరీ.. హేమంత్ సోరెన్ విజ్ఝప్తిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుంది ? అన్నది చూడాలి.