ధోని రిటైర్మెంట్.. సాక్షి ఎమోషనల్ ట్విట్ !

టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, అభిమానులు ధోని రిటైర్మెంట్ పై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ధోని గురించి తీపి జ్ఝాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఘన విడ్కోలు పలుకుతున్నారు.
ధోని రిటైర్మెంట్ పై ఆయన భార్య సాక్షి ఎమోషన్ పోస్ట్ పెట్టింది.

‘మీరు సాధించిన విజయాలను చూసి గర్వపడాలి. రిటైర్మెంట్‌ ప్రకటించినందుకు అభినందనలు. మీరు సాధించిన విజయాలను చూసి నేను గర్విస్తున్నాను. మీకిష్టమైన ఆటకు గుడ్‌బై చెప్పే క్రమంలో మీరు పడిన మనోవేదన నాకు తెలుసు. కన్నీళ్లను దిగమింగుకొని రిటైర్మెంట్‌ ప్రకటించారని అనుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన మాటలు, చేసిన పనిని ప్రజలు మర్చిపోతారేమో కానీ, వాళ్లకు అందించిన అనుభూతిని ఎప్పుడూ మర్చిపోలేరు” అంటూ ఇన్ స్టా గ్రాములో సాక్షి రాసుకొచ్చింది.

90 టెస్టులు ఆడిన ధోని 144 ఇన్నింగ్స్‌ల్లో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక 350 వన్డేలు ఆడగా, 10,773 పరుగులు చేశాడు. ఇందులో 10శతకాలు, 73 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.