బాలు ఆరోగ్యంపై రజనీ వీడియో మెసేజ్

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5న బాలుకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. అప్పటి నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. బాలు ఆరోగ్యం విషమంగా ఉందనే వార్తలు వస్తుండటంతో.. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. తాజాగా  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వీడియో సందేశం రిలీజ్ చేశారు. ‘ప్రియమైన బాలు సర్, మీరు త్వరగా కోలుకోవాలి’ అంటూ ఆకాంక్షించారు.

“ఐదు దశాబ్దాలకు పైగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అనే భాషల్లో పాటలు పాడారు. తన మధురమైన కంఠస్వరంతో కోట్లాదిమందిని అలరించారు. ఇప్పుడాయన కరోనా వైరస్ కలిగించిన విషమ పరిస్థితిని అధిగమించారని తెలిసింది. ఈ వార్త వినగానే నాకు ఎంతో సంతోషం కలిగింది. ఇంకా ఐసీయూలోనే ఉన్న ఆయన త్వరగా కోలుకోవాలంటూ సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడ్ని ప్రార్థించాను” అంటూ రజనీ వీడియోలో పేర్కొన్నారు.

బాలు ఆరోగ్యంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఈ ఉదయం అప్ డేట్ ఇచ్చారు. నాన్న కోలుకుంటున్నారు. మనుషులని గుర్తు పడుతున్నారు. వారం రోజుల్లో ఆయన కోలుకుంటారని, నాన్న ఆరోగ్యం గురించి ప్రార్థించిన వారందరికీ కృతజ్ఝలు తెలిపారు చరణ్.