సింగర్ సునీతకు కరోనా పాజిటివ్

కరోనా బారినపడుతున్న సినీ ప్రముఖుల జాబితా పెరుగుతోంది. తాజాగా సింగర్స్ సునీత, మాలవికా కరోనా బారినపడ్డారు. ఓ టీవీ ఛాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌య్యే సంగీత కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వీరిద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో వీరు హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.

దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. గాన గాంధర్వుడు ఎప్సీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నారు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలు కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.