బ్రేకింగ్ : ఐపీఎల్13 స్పాన్సర్ షిప్ దక్కించుకున్న డ్రీమ్ 11

ఐపీఎల్ 13 సీజన్ స్పాన్సర్ షిప్ హక్కులని డ్రీమ్ 11 దక్కించుకుంది. రూ. 250కోట్లకి స్పాన్సర్ షిప్ హక్కులని దక్కించుకుంది. ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం జియో, బైజూస్, టాటా సన్స్ పోటీ పడ్డాయి. పంతాంజలి కూడా రేసులో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఫైనల్ గా ఈ యేడాది ఐపీఎల్ హక్కులని డ్రీమ్ 11 దక్కించుకుంది.

ఇటీవల కాలంలో భారత్-చైనా బార్డర్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి చైనా కంపెనీ వివో తప్పుకోవాలనే డిమాండ్ వినబడింది. అందుకు తగ్గట్టుగానే ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచ్ వివోని తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దాని స్థానంలో డ్రీమ్ 11 స్పాన్సర్ షిప్ హక్కులని దక్కించుకుంది.

దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 11 నుంచి ఐపీఎల్ 13 సీజన్ మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న అన్నీ ఫ్రాంచైంజీలు శిక్షణ శిబిరం కోసం దుబాయ్ వెళ్లనున్నాయ్.