సందీప్ కిషన్ పెళ్లి ప్రకటన

యంగ్ హీరో సందీప్ కిషన్ నుంచి పెళ్లి ప్రకటన వచ్చేసింది. కరోనా లాక్‌డౌన్ టైమ్ లో టాలీవుడ్ లో పెళ్లికానీ ప్రసాదులంతా ఓ ఇంటోళ్లు అయిన సంగతి తెలిసిందే. నిఖిల్, నితిన్, రానా, సుజీత్.. పెళ్లిళ్లు జరిగిపోయాయ్. దీంతో టాలీవుడ్ లో పెళ్లికానీ ప్రసాదుల లిస్టు సగానికి తగ్గింది. అంతేకాదు. త్వరలోనే సందీప్ కిషన్ పెళ్లివార్త చెప్పబోతున్నట్టు ప్రచారం జరిగింది. అది నిజమే అన్నట్టు త్వరలోనే బిగ్ న్యూస్ చెబుతానని సందీప్ ట్విట్ చేశారు. అది పెళ్లి వార్తే అనుకున్నారు అభిమానులు.

తాజాగా పెళ్లిపై ట్విట్టర్ వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు సందీప్ కిషన్. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశాడు. బిగ్ న్యూస్ అంటే పెళ్లి అని ఫిక్స్ అయిపోయారుగా.. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అన్నాడు. సింగిల్ కింగ్ అంటూ యాష్ ట్యాగ్ జత చేశాడు. దీంతో సందీప్ కిషన్ పెళ్లిపై క్లారిటీ వచ్చినట్టయింది.

నటుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న యువ హీరో సందీప్ కిషన్ నిర్మాతగానూ కొనసాగుతున్నాడు. `వెంకటాద్రి టాకీస్‌` బ్యానర్‌ను స్థాపించి `నిను వీడని నీడను నేనే` చిత్రాన్ని నిర్మించాడు.  ప్రస్తుతం తను నటిస్తున్న `ఏ1 ఎక్స్‌ప్రెస్`కు సహా నిర్మాతగా వ్యవరిస్తున్నాడు. తాజాగా `వివాహ భోజనంబు` అనే సినిమా నిర్మించనున్నట్టు ప్రకటించాడు.