ఈఎస్ఐ కేసు : సంచలన నిజాలు బయటపెట్టిన ఏసీబీ

ఏపీ ఈఎస్ఐ స్కామ్ వివరాలని ఏసీబీ మీడియాకు వివరించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ మీడియాకు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 19 మందిపై కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.

ఈ కేసులో కీలక ఆధారాలు దొరికాయ్. మందుకు, పరికరాలు కొనుగోలు చేసిన ముగ్గురిపై అభియోగాలు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో ఛార్జ్ షీటు దాఖలు చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలిపారు. కీలక ఆధారాలు దొరికాయని తెలిపారు. ఇక ఈ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి ఇంకా బెయిల్ దొరకని సంగతి తెలిసిందే.