ఇన్ స్టా గ్రామ్’పై హార్థిక్ పాండ్యా ఆగ్రహం

యూఏఈ వేదికగా సెప్టెంబర్‌19 నుంచి ఐపీఎల్‌-2020 మొదలవుతున్న సంగతి తెలిసిందే. కరోనా ముప్పు ఉండటంతో నిర్వాహకులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అయితే ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులు వెళ్లేందుకు బీసీసీఐ అడ్డేమీ చెప్పలేదు. కాకపోతే ఆటగాళ్లను కలవకూడదని, వేరుగా ఉండాలని నిబంధనలు విధించింది.

ఫ్రాంచైజీలకే మొత్తం భారం వదిలేసింది. ఇప్పటి వరకైతే ఏ జట్టూ కుటుంబ సభ్యులకు అనుమతించినట్టు సమాచారం లేదు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆటగాళ్లు కూడా ఫ్యామిలీని వెంట తీసుకెళ్లేందుకు ఇష్టపడలేదు. కొత్తగా డ్రైన హార్థిక్ పాండ్య కుటుంబాన్ని వదిలి దుబాయ్‌కు వెళ్లబోతున్నాడు. పాండ్య ముంబయి శిబిరానికి చేరిపోయాడు. ఈ నేపథ్యంలోనే అతడిని చాలా మిస్సవుతున్నానని సతీమణి నటాషా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. కమ్యూనిటీ మార్గదర్శకాల ప్రకారం ఆక్షేపణీయంగా ఉందని ఆ చిత్రాన్ని ఇన్‌స్టా తొలగించడం గమనార్హం. ఈ వ్యవహారం నటాషాకు కోపం తెప్పించినట్టుంది! ‘నిజంగానేనా@ఇన్‌స్టా’ అని ఆమె ఇన్‌స్టా రీల్స్‌ పోస్ట్‌ చేసింది.