కె ఎఫ్ సి అధినేత కమలాకర్ రెడ్డి కన్నుమూత

టాలీవుడ్ విషాదం చోటు చేసుకుంది. కె ఎఫ్ సి సంస్థ అధినేతల్లో ఒకరైన కమలాకర్ రెడ్డి రోడ్ ప్రమాదంలో మృతి చెందారు. ఇటీవలే కమలాకర్ రెడ్డి తండ్రి నందగోపాల్ రెడ్డి (75) కి కరోనా పాజిటివ్ అని తేలింది. అదే సమయంలో కమలాకర్ రెడ్డి పరిక్ష చేయించుకుంటే ఆయనకు కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో నెల్లూరు సమీపంలోని పల్లెటూరిలో వుంటున్న వీరు కరోనా చికిత్స కోసం అంబులెన్స్ లో హైదరాబాద్ కి పయనమయ్య్యారు.

కానీ నల్గొండ జిల్లా  దామరచర్ల మండలం కొండ్రపోల్‌లో ఆగివున్న లారీని అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రికొడుకులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు..అంబులెన్స్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.