సింగర్ రెండేళ్ల కూతురికి కరోనా

ప్ర‌ముఖ సింగ‌ర్ మాళ‌విక క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఇప్పుడామె హోం ఐసోలేష‌న్‌లో ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. బాధకరమైన విషయం ఏంటంటే.. ? మాళవిక రెండేళ్ల కుతూరు కూడా క‌రోనా బారిన పడ్డారు. ఇప్పుడీ వార్త అందరినీ కలచివేస్తోంది.

మాళ‌విక త‌ల్లిదండ్రులు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. జ‌లుబు, జ్వ‌రం ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో టెస్ట్ చేయించుకోగా క‌రోనా  అని నిర్ధార‌ణ అయిన‌ట్టు మాళ‌విక తెలిపారు. మాళ‌విక కుటుంబ స‌భ్యులంతా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆమె అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు. ఇక కరోనా బారినపడిన మరో సింగర్ సునీత.. కోలుకున్న సంగతి తెలిసిందే.