మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

ఆ మధ్య నాన్ స్టాప్ గా పెట్రో ధరల రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజుల ఆ పెంపునకు బ్రేక్ పడింది. తాజాగా మరోసారి పెట్రో రేట్లు పెరిగాయ్. లీటరు పెట్రోల్‌పై 10 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ.81.06 కి చేరింది. గత ఐదు రోజుల్లో చమురు సంస్థలు లీటరు పెట్రోలుపై 57 పైసలు పెంచాయి.

మరోవైపు గత రెండు వారాలుగా డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతుండటం విశేషం. దిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.73.62గా ఉంది. అంతర్జాతీయంగా పెట్రోల్‌ ధరలు పెరుగుతుండటం.. బ్యారెల్‌ ముడి చమురు ధర 45 డాలర్లు దాటడం వల్ల దేశీయ చమురు సంస్థలు ధరల్లో సవరణలు చేసినట్లు తెలుస్తోంది.