దేశంలో 68,898 కొత్త కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో కొత్తగా మరో 68,898 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,05,823కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 21లక్షల 58వేల మంది కోలుకోగా మరో 6లక్షల 92వేల క్రియాశీల కేసులు ఉన్నాయి.

నిన్న కొత్తగా మరో 983మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 54,849కి చేరింది. నిన్న ఒక్కరోజే మరో 62వేల మంది కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 73.91శాతంగా ఉండగా, మరణాల రేటు 1.90శాతంగా ఉంది.