సీఎం జగన్ శ్రీశైలం పర్యటన వాయిదా

ఏపీ సీఎం జగన్ శ్రీశైలం పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం శ్రీశైలంలో ఈరోజు జగన్‌ పర్యటించాల్సి ఉంది. కానీ, గురువారం రాత్రి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 9 మంది సిబ్బంది విద్యుత్‌ కేంద్రంలో చిక్కుకు పోయారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 ఈ నేపథ్యంలో సీఎం తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎలాంటి సాయం కావాలన్నా అందించాలని ఏపీ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఎగువన కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. జలాశయం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.