బాలుకు కరోనా.. సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించిన సింగర్ !

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన అరోగ్యం విషమంగానే ఉంది. బాలు త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.

మరోవైపు బాలుకు కరోనా సోకడానికి కారణం సింగ‌ర్ మాళ‌వికే అంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. జూలై నెలాఖ‌రులో హైద‌రాబాద్‌లో ఓ కార్య‌క్ర‌మానికి బాలు వెళ్లార‌ని, అదే స‌మ‌యంలో త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని తెలిసినా మాళ‌విక కూడా పాల్గొంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ ప్రచారంపై మాళవిక బాగా నొచ్చుకుంది. తాజాగా ఈ ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులని కలిసి ఫిర్యాదు కూడా చేసింది. ఎస్పీ బాలు క‌రోనా బారిన ప‌డ‌డానికి తానెంత మాత్రం కార‌ణం కాదు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.