‘వి’ వచ్చేసోంది.. ‘రెడ్’ సంగతేంటీ ?

మాది ఓటీటీ సినిమా కాదన్న.. ‘వి’ సినిమా ఫైనల్ గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పట్లో థియేటర్స్ తెరచుకొనే అవకాశాలు లేకపోవడంతో నిర్మాత దిల్ రాజు ఓటీటీ వైపు మొగ్గు చూపారు. రిలీజ్ కి రెడీగా ఉన్న మరో చిత్రం ‘రెడ్’ సంగతేంటీ ? అనే చర్చ మొదలైంది. అయితే ‘రెడ్’ ఓటీటీ రిలీజ్ కోసం ఆరాటపడటం లేదు.

దానికి కారణం. స్రవంతి మూవీస్ రామ్ సొంత బ్యానర్ లాంటిది. పైగా నిర్మాతలకు డిజిటల్ కంపెనీకి మధ్య ఒక ఆసక్తికరమైన డిజిటల్ ఒప్పందం జరిగింది. ఇప్పటికి హిందీ డబ్బింగ్ హక్కులు.. తెలుగు శాటిలైట్  హక్కులను విక్రయించారు. ఆ మేరకు నిర్మాత ఇప్పటికే పెద్ద మొత్తాలను జేబులో వేసుకున్నారట.పైగా ఇలాంటి థ్రిల్లర్ సినిమాని పెద్ద తెరపై వీక్షిస్తేనే బావుంటుందనేది రామ్ ప్లాన్. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం హైలైట్ గా ఉండనుంది. ఈ చిత్రంలో నివేదా పెతురాజ్, మాళవికా శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు.