‘రాధేశ్యామ్’కు రెండు కష్టాలు

రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. గోపీకృష్ణ బ్యానర్,  యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమా దాదాపు సగానికి పైగా పూర్తయింది. సినిమా చాలా వరకు వింటేజ్ ఇటలీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. అందువల్ల మరొక్క సారి ఇటలీ వెళ్లాల్సి వుంది అని వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. 

ఈ సినిమాకు మరో సమస్యే బడ్జెట్. ఇప్పటికే ఈ సినిమా మీద పెట్టుబడి గట్టిగా పెట్టారని, అది కాకుండా సాహో ఫైనాన్షియల్ బర్డెన్ లు కొన్ని రాథేశ్వామ్ మీదకు వచ్చాయని టాక్ వినిపిస్తోంది. ఇవ్ననీ ఇలా వుంచితే కరోనా కారణంగా యువి సంస్థకు థియేటర్ల ఫలితంగా గట్టి దెబ్బ తగిలింది. కరోనా టైమ్ లో లక్షలకు లక్షలు కరెంటు బిల్లలు, థియేటర్ నిర్మాణ ఇఎమ్ఐ లు, అలాగే లీజు రెంట్లు కట్టాల్సి వుంటుందని టాక్. ఇవన్నీ చూసుకుని, రాథేశ్వామ్ మీద పెట్టుబడి పెట్టాడం సమస్యగా మారింది.

వచ్చే  యేడాది ఫిబ్రవరి నుంచి ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాకి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ లోపు రాధేశ్యామ్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే.. ఈ సినిమా వెనకబడినట్టేనని తెలుస్తోంది.