విలు విద్య నేర్చుకుంటున్న ప్రభాస్

బాహుబలి ప్రభాస్ రామావతారం ఎత్తబోతున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న స్ట్రయిట్ బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్నారు. టీ-సీరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫిలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రామాయణం యుద్ధకాండ నేపథ్యంలో ఆదిపురుష్ తెరకెక్కనుందని తెలిసింది. రాముడిగా ప్రభాస్ కనిపించబోతున్నారు. సీత ఎవరు ? రావణాసురుడు ?? ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ విలు విద్యని నేర్చుకోబోతున్నారట. విలువిద్యలో ప్రభాస్ కు ట్రైనింగ్ ఇచ్చేందుకు థాయ్ లాండ్ నుంచి శిక్షకుడిని రప్పించే అవకాశం ఉందని  చెపుతున్నారు. త్వరలోనే ప్రభాస్ విలు విద్య శిక్షని మొదలుపెట్టబోతున్నట్టు సమాచారమ్. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ లో ఆదిపురుష్ తెరక్కెనుంది.

ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమాలో నటించనున్నారు. వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఆదిపురుష్ రెగ్యూలర్ షూటింగ్ ఎప్పటి నుంచి అనేది తెలియాల్సి ఉంది.