గుడ్ న్యూస్ : తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. ఫాదర్ గా ప్రమోషన్ రాబోతుంది. ‘ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం. 2021 జనవరిలో’… అంటూ భార్య అనుష్కతో కలిసి చిరు నవ్వులు చిందిస్తున్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు విరాట్. దీంతో విరాట్ దంపతులకి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్.

ప్రస్తుతం ఐపీఎల్ 2020లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లారు. అక్కడ నుంచి విరాట్-అనుష్క దంపతులు గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నారు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 2020 జరగనున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో వన్ డే లో విరాట్ టాప్ లో నిలిచారు. టీ20లో రెండో స్థానంలో ఉన్నారు.