తెలంగాణలో 3వేల కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2,932 కొత్త‌ కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది మృతి చెందారు.  దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,17,415 చేరింది. మృతుల సంఖ్య 799కి చేరింది.

నిన్న ఒక్కరోజే 1580 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 87,675కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,941 కేసులు యాక్టివ్‌గా ఉండగా, అందులో 22,097 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 520 కేసులు నమోదయ్యాయ్.