‘ఆచార్య’ కథ ఇంకా రిజిస్టర్ అవ్వలేదా ?

‘ఆచార్య’ క‌థ‌పై పెద్ద ర‌చ్చ జ‌రుగుతోంది. ఈ క‌థ నాదే అంటూ రాజేష్ అనే స‌హాయ ద‌ర్శకుడు మీడియాకు ఎక్కిన సంగతి తెలిసిందే. 2017లో ఈ కథని రాసుకున్నా. బాలయ్య కోసం రాసుకొన్న కథ ఇది. ‘పెద్దాయన’ వర్కింగ్ టైటిల్ తో రాసుకున్నానని చెబుతున్నాడు. దానికి సంబంధించిన రుజువులని చూపిస్తున్నారు. ప్రస్తుతం తెరకెక్కుతోన్న ఆచార్య కథని పాయింట్ టు పాయింట్ చెబుతున్నాడు. ఆయన మాటలని బట్టీ చూస్తే.. ఆచార్య కథ నిజంగానే అతనిదే అనిపిస్తోంది. మరోవైపు ఆచార్య తన సొంత కథని కొరటాల శివ స్టేట్ మెంట్ ఇచ్చేశారు.

ఇలాంటి వివాదం చెల‌రేగిన‌ప్పుడు.. రెండు క‌థ‌ల్నీ ప‌క్క ప‌క్క‌న పెట్టి, వాటిలోని పోలిక‌లు బేరీజు వేస్తారు. కానీ.. ఇప్పుడు అలా జ‌ర‌గ‌డం లేదు. ఎందుకంటే.. ? రాజేష్ రాసుకున్న ‘పెద్దాయ‌న’ క‌థ రిజిస్ట‌ర్ అయ్యింది. కానీ ‘ఆచార్య’ క‌థ రిజిస్ట‌ర్ అవ్వ‌లేదు. ఆచార్య క‌థ‌లో ఏముందో, ఏం లేదో… ఎవ్వ‌రికీ తెలీదు. అలాంటప్పుడు ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.