ఈఎస్ఐ స్కామ్.. అచ్చెన్నాయుడుకి బెయిల్ !

ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అచ్చెన్నాయుడుకి ఊరట లభించింది. ఆయన ఏపీ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లకూడదని అచ్చెన్నకు హైకోర్టు షరతు విధించింది. రిమాండ్ ఖైదీగా ఉన్న అచ్చెన్నాయుడు కరోనా బారిపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఈఎస్ ఐ స్కామ్ లో దాదాపు రూ. 150కోట్ల అవినీతి జరిగిందనే అభియోగాలున్నాయి. ఈ కేసులో అప్పటి కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన అచ్చెన్నాయుడుతో పాటు పలువురు ఉద్యోగులని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.