తెరాస ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

సీఎం కేసీఆర్, తెరాస అధినేత పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విసృతంగా చర్చించాలని, అందుకు ముందస్తుగా ప్రిపేర్ కావాలని సభ్యులకి సూచించారు.

ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో కరోనా చికిత్స, కరోనా కాలంలో కరెంట్ బిల్లులని అస్త్రాలుగా చేసుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. దేశంలోనే కరోనా టెస్టులు తక్కువగా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు బ్యాడ్ రికార్డ్ ఉంది. దీనికితోడు ప్రయివేటు ఆసుపత్రులు లక్షల్లో వసూలు చేసిన బిల్లులకి సంబంధించిన కొన్ని ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. వీటిని ఆధారంగా చేసుకొని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.