తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ట్విట్టర్ వేదికగా తనకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిందని బుద్ధా వెంకన్న తెలిపారు.

“నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్ సూచించారు.ఈ 14 రోజులు రాజకీయలకు దూరంగా ఉంటాను.నాకు దైవ సమానులైన మా అధినేత చంద్రబాబు గారు, అభిమానుల ఆశీస్సులతో కోవిడ్ ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను” అని ట్విట్ చేశారు.