నీట్ విద్యార్థులకి అండగా సోనూసూద్

కరోనా లాక్ లాక్‌డౌన్ టైమ్ లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ గొప్ప మనసు చాటుకున్నారు. పేదలకి అండగా నిలిచారు. సొంత ఖర్చులతో వలస కూలీలని సొంతూళ్లకి తరలించారు. ఇప్పటికీ సోనూసూద్ సాయాల పరంపరం కొనసాగుతోంది. తాజాగా నీట్, జేఈఈ విద్యార్థులని పరీక్ష కేంద్రాలకి చేర్చే బాధ్యతని తీసుకున్నారు.

దేశ వ్యాప్తంగా నీట్, జేఈఈ పరీక్షలని వాయిదా వేయాలనే డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం మాత్రం షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. ఓ వైపు కరోనా విజృంభణ, మరోవైపు వరదలతో పరీక్ష కేంద్రాలకి చేరడం కష్టంగా ఉందని విద్యార్థులు సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లారు. డోంట్ వరీ.. అంటూ విద్యార్థులకి సోనూసూద్ అండగా నిలిచారు. సొంత ఖర్చులతో వారిని పరీక్ష కేంద్రాలకి తరలిస్తానని హామీ ఇచ్చారు.