ఏపీలో 10,548 కొత్త కేసులు

ఏపీలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,548 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మరో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,14,164కి చేరాయి. మృతుల సంఖ్య 3,796 చేరాయి.

గత 24 గంటల్లో 8,976 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం 3,12,687 మంది కరోనాను జయించి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 97,681 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది.