రెబల్ స్టార్ చేపల పులుసు.. రుచి ఎలా ఉందంటే ?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేపల ఫ్రై చేశారు. అమ్మకు కోసం చేసిన చేపల ఫ్రై వీడియోని చిరు అభిమానులతో పంచుకున్నారు. అది వైరల్ అయ్యింది. తాజాగా సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు చేపల పులుసు చేశారు. దానికి సంబంధించిన వీడియోని కృష్ణంరాజు కూతురు సాయి ప్రదీమా తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

“వీకెండ్ స్పెషల్.. డాడీ చేపల పులుసు చేశారు. చేపల పులుసు చేయడంలో ఆయనను మించిన వారు లేరు. కేవలం వాసన చూసి ఉప్పు సరిపోయిందో, లేదో చెప్పేస్తారు. నాన్న అందులో ఎక్స్‌పర్ట్” అని ఆమె పేర్కొన్నారు. వీడియోలో చేపల పులుసు చూడ్డానికి కలర్ ఫుల్లుగా ఉంది సాయి ప్రదీమా చెప్పినట్టు.. రెబల్ స్టార్ చేపల పులుసు రుచి అదిరిపోయేలా ఉంటుందని తెలిసిపోతోంది.