దారుణం : 9 నెలల పాపను భవనం నుంచి పడేసి.. దూకేసిన మహిళ

గుంటూరులో దారుణం జరిగింది. భర్త, అత్తామామల వేధింపులు భరించలేక 9 నెలల పాపని ఐదు అంతస్తుల భవనం నుంచి కింద పడేసింది. ఆ తర్వాత ఆమె కూడా దూకేసింది.

పోలీసుల కథనం ప్రకారం..ప్రకాశం జిల్లా పంగులూరుకు చెందిన మనోజ్ఞ(28), గుంటూరు లక్ష్మీపురానికి చెందిన నర్రా కల్యాణచంద్రకు మూడేళ్ల కిందట వివాహమైంది. కల్యాణ చంద్ర నేవీలో తాత్కాలిక ఉద్యోగి. మనోజ్ఞ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. వీరికి తులసి (9నెలలు) కుమార్తె ఉంది. లాక్‌డౌన్‌ విధించడంతో మూడు నెలల కిందట హైదరాబాద్‌ నుంచి వచ్చి గుంటూరు లక్ష్మీపురంలో ఉంటున్నారు.

అత్తమామల వేధింపులు, భర్తతో గొడవ కారణంగా మనోజ్ఞ శనివారం ఉదయం తులసిని తీసుకుని అపార్ట్‌మెంట్‌ అయిదో అంతస్తుకు చేరుకున్నారు. కుమార్తెను అక్కడి నుంచి పడేసి, తనూ దూకారు. కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి చిన్నారి మరణించింది. మనోజ్ఞను ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. అయితే ఇది హత్య కాదు.. భర్తే మనోజ్ఝని హత్య చేశాడని.. తల్లితరుపు వారు ఆరోపిస్తున్నారు.