అందరూ.. ఆమె అందాలనే చూశారట !


అందచందాలతో అభిమానుల మనసు దోచేసింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. అందరి చూపులని తనవైపు తిప్పుకొంది. ‘ది టైమ్స్‌ 50 మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ 2019’గా మొదటి స్థానంలో నిలిచింది. ఆమె తర్వాత స్థానాల్లో కత్రినా కైఫ్‌, దీపికా పదుకుణె, కియారా అడ్వానీ, శ్రద్ధా కపూర్‌, యామీ గౌతమ్‌, అదితీ రావు హైదరీ, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ లాంటి తారలు నిలిచారు.

దీనిపై దిశా పటానీ స్పందిస్తూ.. ‘నేను ఫిట్‌గా ఉంటాను. అందుకే అభిమానులు నన్ను మొదటిస్థానంలో నిలబెట్టి ఉండొచ్చు. వాళ్లందరికీ ధన్యవాదాలు’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. దిశా పటాని ఇటీవలే ‘భాఘి 3’, ‘మలంగ్‌’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో లోఫర్ సినిమా చేసింది. ధోని బయోపిక్ తో రెండోసారి తెలుగు ప్రేక్షకులని పలకరించింది. సుకుమార్-బన్నీ హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్ కోసం దిశా పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక దిశ ఫోటో షూట్స్ కోసం ప్రత్యేక అభిమాన గణం ఉందన్న సంగతి తెలిసిందే.