చెస్ ఒలింపియాడ్‌లో భారత్’కు స్వర్ణం

ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. రష్యాతో కలిసి ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ని సొంతం చేసుకుంది. మొట్టమొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహించిన చెస్ ఒలింపియాడ్‌ ఇది.

భారత్‌ను విజేతగా నిలపడంలో కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు. ఫైనల్‌లో రష్యాకు చెందిన అలెగ్జాండ్రాతో తలపడ్డారు. మ్యాచ్‌ డ్రా కావడంతో భారత్‌- రష్యాను ఉమ్మడి విజేతగా ప్రకటించారు. 1927లో అధికారిక చెస్‌ ఒలింపియాడ్‌ ఆరంభం అయినప్పటి నుంచి భారత్‌ ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి.