TSలో 2,734 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో తెలంగాణలో 2,734 కొత్త‌ కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,27,697కి చేరింది. మృతుల సంఖ్య 836కి చేరింది.  
 
నిన్న ఒక్కరోజే 2,325 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 95,162గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,699 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. మరో 24,598 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.