ఏపీ మండలి చైర్మన్’కు కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏపీ శాసనమండలి చైర్మన్ ఎం.ఎ షర్మీఫ్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజులుగా తనని కలిసినవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని షరీఫ్ కోరారు.

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 4,34,771 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 3,969కి చేరింది. అయితే ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 10వేలకుపైనే నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 10,004 కేసులు బయటపడ్డాయి.