ప్రణబ్‌’కు ప్రధాని నివాళులు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీ 10 రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్‌ నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

ప్రస్తుతం ప్రణబ్‌ ముఖర్జీ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఉంచనున్నారు. తదనంతరం గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రణబ్‌ భౌతికకాయాన్ని శ్మశాన వాటికకు తరలించనున్నారు. గన్‌ క్యారేజీపై కాకుండా సాధారణ అంబులెన్సులో శ్మశాన వాటికకు తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లోధి శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో ప్రణబ్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.