ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం జగన్ పై మందుబాబులు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో మద్యపానం నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం మద్యం ధరలని భారీగా పెంచింది. దేశంలోనే మధ్య ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏపీనే. అయితే అంత రేటుపెట్టి.. మద్యం కొనుక్కోలేని వారు… తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు.

పోనీ పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి మద్యం తెచ్చుకుందామంటే.. అందుకు అనుమతి లేదు. దీంతో చాటుమాటున మద్యం తెచ్చుకుంటున్నారు. పోలీసులకి పట్టుబడుతున్నారు. అయితే తాజాగా ఏపీ మందు బాబులకి హైకోర్ట్ నుంచి తీపి కబురు అందింది. పక్కరాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చేందుకు కోర్టు అనుమతినిచ్చింది. కాకపోతే మూడు బాటిల్స్ మించరాదనే కండీషన్ పెట్టింది.