ఐపీఎల్-2020 మరో షాక్

దుబాయ్ వేదికగా ఈ నెల 19 నుంచి ఐపీఎల్2020 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే మెగా టోర్నీకి ముందు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా  బీసీసీఐ మెడికల్ టీమ్ మెంబర్‌కి కరోనా పాజిటివ్ గా వచ్చింది. వైద్య బృందం ఎక్కువ మంది ఆటగాళ్లను కలిసే అవకాశం ఉండటంతో సర్వత్రా ఆందోళన మొదలైంది.

కరోనా బారిపడిన 11 మంది చైన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకి నెగటివ్ రిపోర్ట్ వచ్చిన సంగతి తెలిసిందె. దీంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది. ఇక ఈ మెగా టోర్నీ నుంచి వ్యక్తిగత కారణాలతో సురేష్ రైనా, లసిత్ మలింగ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇకదుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 ఐపీఎల్ 2020 జరగనుంది. మొత్తం 53 రోజుల పాటు 60 మ్యాచ్‌ లు జరగనున్నాయి.