అసెంబ్లీ సమావేశాలు : వ్యూహాలు సిద్ధం చేస్తున్న కేసీఆర్

ఈ నెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈనేప‌థ్యంలో సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లో ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌, అనుస‌రించాల్సిన వ్యూహం, ఇత‌ర అంశాల‌పై  చ‌ర్చించనున్నారు.  మంత్రులు, ఇత‌ర‌ నేత‌ల‌తో సమీక్ష నిర్వ‌హించానున్నారు. మంత్రులు, చీఫ్ విప్‌లు, విప్‌ల‌తో ఈరోజు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఈ స‌మావేశానికి హాజరుకానున్నారు. క‌రోనా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా స‌మావేశాలను ఎలా నిర్వ‌హించాల‌నే అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మరోవైపు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలని సిద్ధం చేసుకుంటున్నాయ్. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వ వైఫల్యం, ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స, కరోనా కాలంలో వచ్చిన అధిక విద్యుత్ బిల్లులపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి.