అమరావతిలో పవన్ ఫ్లెక్సీ గొడవ

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే హంగామా ముగిసింది. చిత్తూరులో ముగ్గురు అభిమానులు కరెంట్ షాక్ కి గురై మృతి చెందిన ఘటన తప్పా.. అంతా బాగానే జరిగింది. అక్కడక్కడ చిన్ని చిన్ని గొడవలు సహజమే. తాజాగా అమరావతిలో పవన్ ఫ్లెక్సీపై గొడవ జరిగింది. అమరావతి మండలం లింగాపురం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టొద్దని ఓ వర్గం వారు వాదించగా.. ఇక్కడే పెడతామని ఇంకో వర్గం బదులిచ్చింది. ఇలా మాటామాటా పెరగడంతో అది కాస్త ఘర్ఫణకు దారి తీసింది. ఈ క్రమంలో ఇరువర్గీయుల్లో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసుకున్న అమరావతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.