గుడ్ న్యూస్ : బాలు డిశ్చార్జ్ ఎప్పుడంటే ?

అభిమానుల ప్రార్థనలు ఫలించాయి. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. ఈ మేరకు చెన్నై ఎంజీఎం ఆసుపత్రి హెల్త్ బులిటెల్ విడుదల చేసింది. ప్రస్తుతం బాలు సృహాలోనే ఉన్నారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపింది. బాలు తనయుడు ఎస్పీ చరణ్ కూడా ఇదే చెప్పారు. ఈ వారంతరంలో గుడ్ న్యూస్ వింటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే వారం బాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఆగస్టు 5న బాలు కరోనాతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు వారాలపాటు కోమాలోనే ఉన్నారు. ఆయనకి వెంటిలెటర్ పై చికిత్స అందించారు. అయితే అందరి ప్రార్థనలు ఫలించి బాలు కోలుకుంటున్నారు. ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయన స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్న న్యూస్ బాలు అభిమానులు ఆనందపడుతున్నారు.