నల్లొండలో రోడ్డు ప్రమాదం.. ఐదురుగురు మృతి !

నల్లొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురి తండా మలుపు వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-నాగార్జునసాగర్ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న కారు పైప్ లైన్ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.