దేశంలో 86,432 కొత్త కేసులు, 1,089 మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.  గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 86,432 కొత్త కేసులు నమోదయాయ్. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179కి చేరింది. కొత్తగా 1,089 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 69,561కి పెరిగింది.

ప్రస్తుతం 8,46,395 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 31,07,223 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.73 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,77,38,491 కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన్లు భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది.