ఇబ్బందేనే అంటూ.. చెప్పేసింది !

సినీ పరిశ్రమలో రెండు సమస్యలు ఎప్పుడూ చర్చకు వస్తుంటాయ్. కానీ వాటి గురించి ఎవరు ఫ్రీగా మాట్లాడరు. అవే కాస్టింగ్ కౌచ్, పురాషాధిక్యత. ఈ రెండు గురించి మాట్లాడటం ఇబ్బందే అంటోంది హీరోయిన్ కైరా అద్వానీ. ముఖ్యంగా పురుషాధిక్యత గురించి. 

“ఈ రోజుల్లో పురుషాధిక్యత గురించి మాట్లాడటానికి నాకే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఆడ, మగ అనే తేడా లేదు. ప్రతి రంగంలోనూ సమాన అవకాశాలు దొరుకుతున్నాయి. లేనిచోట పోరాడి సాధించుకుంటున్నారు. అయితే ఈ పోరాట స్ఫూర్తి ఇంటి దగ్గరి నుంచే మొదలవ్వాలి. ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ తమ బాధ్యతల్ని సమానంగా పంచుకోవాలి” చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం కియారా నటించిన ‘లక్ష్మీ బాంబ్‌’ విడుదలకు సిద్ధమవుతుండగా, ‘ఇందూ కి జవానీ’,’షేర్‌షా’,’భూల్‌ భూలయ్య2′ చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్ నటించనున్న స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా ఆదిపురుష్ లో సీత పాత్ర కోసం కైరా పేరు కూడా వినిపిస్తొంది.