హరీష్ రావుకు కరోనా.. కేటీఆర్ కామెంట్ !

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొద్దిసేపటి కిత్రమే హరీష్ ట్విట్ చేశారు. ‘తనకి కరోనా పాజిటివ్ గా వచ్చింది. ప్రస్తుతం బాగానే ఉంది. ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నా. ఇటీవల తనని కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోండి. వెంటనే హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోంది’అని సూచించారు.

హరీష్ రావు కరోనా పాజిటివ్ రావడంపై తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘త్వరగా కోలుకోవాలి బావా. నాకు తెలుసు.. మిగితావారి కంటే త్వరగా నీవు కోలుకుంటావ్’ అని ట్విట్ చేశారు. కరోనా విజృంభిస్తున్న టైమ్ లో హరీష్ రావు, కేటీఆర్.. స్థానికంగా పర్యటించారు. ప్రజల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. దీంతో ఎల్లుండి నుంచి ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశాలకి హరీష్ దూరం కానున్నారు.