రాష్ట్రమేమీ జగన్‌ బానిస కాదు : చంద్రబాబు

రాష్ట్రమేమీ సీఎం జగన్‌ బానిస కాదన్నారు తెదేపా అధినేత చంద్రబాబు. ఉచిత విద్యుత్ పై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 22పై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఉచిత విద్యుత్‌ రైతులు పోరాడి సాధించుకున్న హక్కు.. ఉచిత విద్యుత్‌ ను యథాతథంగా పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

“వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ పథకం పేరిట మీటర్లు బిగిస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు రైతుల ప్రాణాలు తీయడమే. ప్రభుత్వం తక్షణమే జీవో 22 ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ నిర్ణయం ..సీమ, మెట్టప్రాంతం రైతుల మనోభావాలు దెబ్బతీస్తోంది. వైకాపా ప్రభుత్వ నయవంచన రోజుకొకటి బయటపడుతోంది” అన్నారు బాబు.