‘సర్కారు వారి “పాట’లతో మొదలెట్టారు”

ఈ యేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సూపర్ స్టార్ మహేష్. ఆయన తదుపరి సినిమా సర్కారు వారి పాట పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

ఇప్పటికే థమన్ పని మొదలెట్టేశారు.  ఈ విషయాన్ని తెలియజేస్తూ థమన్ ట్విట్ చేశారు. ‘సర్కారు వారి పాట కోసం ఫుల్ స్వింగ్ లో పనిచేస్తున్నట్లు చెప్పిన థమన్ ట్విట్ చేశారు. దీంతో పాటు ‘కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ నటిస్తున్న ‘యువరత్న’ ఫస్ట్ సింగిల్ అలాగే కీర్తి సురేష్ నటిస్తున్న ‘మిస్ ఇండియా’ పాటలు ఈ సెప్టెంబర్ లోనే పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు థమన్ తెలిపారు.