మలైకా అరోరాకు కరోనా పాజిటివ్

కరోనా బారినపడుతున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా కరోనా బారినపడ్డారు. మలైకాతో పాటు ఆమె ప్రియుడు అర్జున్ కపూర్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మలైకా హోం క్వారంటన్ లోకి వెళ్లిపోయారు.

ఇప్పటికే బాలీవుడ్ లో అమితాబ్, అమీర్ ఖాన్, కపూర్ ఫ్యామిలీ.. తదితరులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. వారు కరోనా నుంచి క్షేమంగా కోలుకున్నారు. ఇపుడు మలైకా కూడా కరోనా నుంచి కోలుకోవాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మరోవైపు, కరోనా కేసుల్లో బ్రెజిల్‌ను భారత్ దాటేసి ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరింది. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 41లక్షల 37వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడీ సంఖ్యని భారత్ దాటేసింది. సోమవారం ఉదయానికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 42లక్షల 4వేల (42,04,613)కు చేరింది. గడిచిన 24గంటల్లో భారత్ లో  90,802 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.