ఎన్టీఆర్ టు షాహిద్ కపూర్

కరోనా ఎఫెక్ట్’తో దర్శకుల ప్లాన్స్ మారుతున్నాయి. ఇప్పటికే అనుకున్న సినిమాల స్థానంలో కొత్త సినిమాలు వచ్చి చేరుతున్నాయి. కథలు మారుతున్నాయి. హీరోలు మారుతున్నారు. మొత్తంగా ప్లాన్ మారుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్2’తో బిజీగా ఉన్నారు. ఆయన తదుపరి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్’తో ఉండనుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ తారక్ కి కలిసి కథ వినిపించారు. ప్రాజెక్ట్ ఓకే అయిందని తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ బిజీగా ఉన్న తారక్ ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాని చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి చేసేలోపు ప్రశాంత్ నీల్ ఓ బాలీవుడ్ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారమ్. షాహిద్ కపూర్ హీరోగా ఆయన ఓ సినిమా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తారక్ ఆర్.ఆర్.ఆర్, త్రివిక్రమ్ సినిమాలని పూర్తి చేసే లోపు ప్రశాంత్ నీల్ షాహిద్ కపూర్ తో సినిమా చేసి వస్తారని తెలుస్తోంది.