సంజయ్ దత్ సడెన్ షాక్

బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ క్యాన్సర్ బారినపడిన సంగతి తెలిసిందే. దీంతో సంజూ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థించారు. సంజూ మొదటి సెషన్‌ కీమోథెరపీని ముంబైలో సక్సెస్‌ఫుల్‌గా ముగించుకున్నారు. అయినా ఇప్పట్లో ఆయన షూటింగ్ లకి రారు. క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్ లకి వస్తారని అందరు భావించారు. కానీ సంజూ సడెన్ షాక్ ఇచ్చారు. మంగళవారమే ఆయన షూటింగ్ లో జాయిన్ అయిపోయారు.

మంగళవారం ‘షంషేరా’ షూటింగ్‌కి వెళుతూ కెమెరాలకు చిక్కారాయన. కారు అద్దాలు దించి, ‘హాయ్‌’ అంటూ యాక్టివ్‌గా చెయ్యి ఊపారు కూడా. ఈ సినిమా చిత్రీకరణలో రెండు రోజుల పాటు పాల్గొననున్నారట. తర్వాత మళ్లీ చికిత్స చేయించుకుంటారని సమాచారం. ఇక సుకుమార్-అల్లు అర్జున్ హ్యాట్రిక్ చిత్రం పుష్పలోనూ సంజయ్ కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరిగింది.