తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హైదరాబాద్ మేయర్

హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం బొంతు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ తెలంగాణాలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. 
నూతన చట్టం ద్వారా పట్టాదారులు ఇకపై తమ భూముల హక్కుల కోసం ఎటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉండదని చెప్పారు. నూతన చట్టం పట్ల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారని బొంతు అన్నారు.

బుధవారం సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాని శాసన సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై ఇవాళ, రేపు సభలో చర్చించనున్నారు. సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లుకు సభ ఆమోదముద్ర వేయనుంది. అయితే ప్రతిపక్షాలు ఇచ్చే విలువైన సలహాలని స్వీకరించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.