శ్రావణి కేసు : సాయి, దేవరాజులలో ఎవరు దోషి ?


టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు సినిమా సీరియల్ ని తలపిస్తోంది. మానసిక వేధింపుల కారణంగా శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే ఆ వేధింపులకు పాల్పడింది ఎవరు ? అనేది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ల తలపిస్తోంది. దేవరాజు, సాయి పేర్లు తెరపైకి వచ్చాయి.

సాయి వలనే శ్రావణి ఆత్మహత్య చేసుకొంది. దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అంటున్నారు దేవరాజు. దేవరాజు చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం లేదని సాయి చెబుతున్నాడు. తాను శ్రావణి ఫ్యామిలీ ఫ్రెండుని అని చెబుతున్నాడు. వీరిద్దరి మధ్యలో ఆర్ఎక్స్100 నిర్మాత అశోక్ రెడ్ది పేరు కూడా వినిపిస్తోంది.

ఇప్పుడీ కేసులో సాయి, దేవరాజులలో దోషి ఎవరు ? అనే తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. సాయి, శ్రావణి  మధ్యలోకి దేవరాజ్ రావడంతోనే గొడవలు మొదలయ్యాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి.. శ్రావణి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చేలా కనిపిస్తునాయి.